ఇఫ్తార్ విందులో పాల్గొన్న గునుకుల కిషొర్

నెల్లూరు, పవిత్ర రంజాన్ మాసంలో నెల్లూరు రూరల్ స్థానిక జనసేన నాయకులు అజీజ్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు గెలిచి ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం రావాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ పవిత్ర మాసంలో చేసే ఉపవాస దీక్ష కేవలం ఆహారానికి దూరం ఉండటమే కాదు. జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచి దైవచింతనను పెంచి సన్మార్గంలో నడిచేటట్లు చూడటం, ఆకలి విలువ తెలిసి సాటి మనుషులకు సేవా గుణం, సత్ప్రవర్తన అలవాటు చెయ్యటం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, అజీజ్, సుభాన్, షఫి, అబీద్, సాహిత్య, యస్ ధానీ, ఖలీల్, సద్దాం, అహ్మద్, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.