రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్

రాజోలు: జనసేన పార్టీ- చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ను ప్రారంబించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నామన నాగభూషణం మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో త్రాగునీరులేక బాధ పడేవారికి ఈ ట్యాంకర్ ద్వారా ప్రతిరోజు ఉచితంగా త్రాగునీరు సరఫరా చేయటం జరుగుతుందని తెలిపారు.