మే డే శుభాకాంక్షలు పోస్టర్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికులతో మేడే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడాలి జనసేన ఎప్పుడు కార్మికులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, సందీప్ నరసింహారెడ్డి ఉపేంద్ర తదితర జనసైనికులు పాల్గొన్నారు.