గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత రాజ్యాంగ రూపకర్తల విజ్ఞత, వారు నిర్దేశించిన పథం మూలంగానే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఆ మహనీయులు అందించిన రాజ్యాంగం ద్వారానే సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించి, దానిని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మనందరం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ప్రాథమిక ముసాయిదాను రూపొందించిన న్యాయనిపుణుడు శ్రీ బి.ఎన్.రావు, రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహకరించిన ఇతర నిపుణులు, అధికారుల పాత్రను ఈ సందర్భంగా స్మరించుకోవాలని జనసేనాని కోరారు.