జనసేనకు రూ. కోటి విరాళం అందజేసిన ఆస్ట్రేలియా ఎన్. ఆర్. ఐ. సభ్యులు

“నా సేన కోసం.. నా వంతు..” కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా ఎన్. ఆర్. ఐ. సభ్యులు సేకరించిన రూ. కోటి విరాళం చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గురువారం అందజేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్. ఆర్. ఐ. సమన్వయకర్తలు రాజేష్ మల్లా, శశిధర్ కొలికొండ, జనసేన నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జగదీష్ హరిదాస్, జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల, చందు గల్లా పాల్గొన్నారు.