గురుదేవులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: పోలీరెడ్డి

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలం, రావిమెట్ల గ్రామంలో నిడదవోలు మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కండెల్లి శాంతి కుమార్ ని మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశం చేసి వారికి బాధ్యత, చదువు చెప్పే గురుదేవులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరాస్వామి, మండలం ఉపాధ్యక్షులు పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రగౌడ్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబెర్ యమన కాశీ దుర్గ ప్రసాద్, గ్రామధ్యక్షులు బాబీ, చిన్న, రంగోను శ్రీను, గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.