జనసేన ఆధ్వర్యంలో మండా లక్ష్మణరావు సంతాప సభ

  • జనసేన నాయకుల ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామనికి చెందిన జనసేన నాయకులు మండా లక్ష్మణరావు (బుల్లియ)కాలం చేయడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం కాల్వముగ సెంటర్లో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారి జ్ఞాపకార్ధంగా కొంతమంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల జనసేన అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, పినిశెట్టి బుజ్జి, రావూరి నాగు, ఉండపల్లి అంజి, మోహన్, జిల్లెల రక్షక్ పాల్గొనడం జరిగింది.