రైతు కూలీలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన గాదె

చిలకలూరిపేట నియోజకవర్గం దండమూడి గ్రామానికి చెందిన 18 మంది రైతులు కూలీలు పెదనందిపాడు మండలం, చిన్ననందిపాడు గ్రామంలో మొక్కజొన్న పొలం పనికి వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పొలంలో గుళికల మందు చల్లుతూ ఉండగా ఆ మందు ప్రభావం వలన అక్కడ పనిచేస్తున్న రైతు కూలీలు గుళికల ప్రభావం వలన అస్వస్థతకు లోనై సృహ కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వెంటనే చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన జిల్లా కార్యదర్శి తోట రాజారమేష్ కి కాల్ చేసి ఆ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది. స్థానికులు వారిని హుటా హుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొనివచ్చారు అనే విషయం తెలుసుకున్న వెంటనే జనసేన పార్టీ నాయకులతో కలిసి హాస్పటల్ కి వెళ్లి రైతు కూలీలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వారి ఆరోగ్యం పరిస్థితి పై డాక్టర్స్ ని సంప్రదించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, తోట రాజా రమేష్, షేక్ సుభాని, మధులాల్, గంగరాజు, చిలకలూరిపేట నాయకులు మునిర్ హసన్, జీవన్, శివశంకర్, పసుపులేటి సాయి, తదితరులు పాల్గొన్నారు.