ఉప్పాడ వరప్రసాద్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన ఇచ్చాపురం జనసేన

ఇచ్ఛాపురం, కోజ్జిరియా పంచాయతీలో ఉప్పాడ వరప్రసాద్ అనే జనసైనికులు అనారోగ్యంతో మరణించిన కారణంగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున కమలాయిపుట్టుగ మరియు కొజ్జిరియా జనసైనికులు రూ.12 వేలు ఆర్థిక సహాయంను ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, కొజ్జిరియా ఎంపీటీసీ అభ్యర్థి పనపాన లింగరాజు చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.