గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఇచ్చాపురం జనసేన

ఇచ్చాపురం: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చాపురం నియోజకవర్గంలో 9వ వార్డులో గత 14 సంవత్సరాలుగా ఉన్న జాతీయ జెండా స్థూపంపై వైసీపీ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమంలో జాతీయ జెండా స్తూపం పైన వైసిపి జెండా ఎగరవేసి భారతదేశానికే సిగ్గుచేటు కలిగేలా అవమానించారు. అదే రోజు ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఖండించి ఈ 74వ గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేస్తాం అని ఆరోజు చెప్పి నేడు జాతీయ జెండానే సగర్వంగా ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, మత్స్యకార విభాగ ప్రతినిధి నాగుల హరి బెహరా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దివాకర్, నియోజకవర్గ నాయకులు లోల్ల రాజేష్, రొక్కల భాస్కర్, సంతోష్ మహారాణా, సురేష్, హేమాచలపతి, వీరమహిళలు శైలజ, సుశీల, నీలవేణి మరియు ఇచ్చాపురం నియోజకవర్గం కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.