క్రియాశీలక సభ్యుడికి ప్రమాద భీమా చెక్ అందజేసిన ఇఛ్ఛాపురం జనసేన నాయకులు

ఇఛ్ఛాపురం, కవిటి మండలం, బి.గొనపపుట్టుగ పంచాయతీ తుంగాన పుట్టుగ గ్రామానికి చెందిన జనసైనికుడు తుంగాన వెంకటేష్ కొద్దిరోజులు క్రితం ద్విచక్ర వాహనంపై ప్రమాదానికి గురై చేతికి బలమైన గాయం అవడం జరిగింది. జనసేనపార్టీ సభ్యత్వం అతనికి ఉండటం వల్ల పార్టీ తరుపు నుండి భీమా మంజూరు అయిన 44 వేల రూపాయల చెక్కును ఇచ్ఛాపురం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, గ్రామ పెద్దలు తుంగాన చిరంజీవులు, తుంగాన రామారావు, తుంగాన మోహనరావు, తుంగాన ఇంద్రరావు సమక్షంలో అతనికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బడగల రామకృష్ణ, దూగాన దివాకర్, అంగ సురేష్, హేమా చలపతి, దేవా, శివ, తలగాన ఈశ్వర్, వల్లభ, జోగారావు తదితరులు పాల్గొన్నారు.