ఇచ్చాపురం జనసేన – టీడీపీ ఆత్మీయ సమావేశం

ఇచ్చాపురం, జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా రాబోయే రోజుల్లో ఇరు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని కార్యాచరణ కోసం మంగళవారం ఇచ్ఛాపురం తెలుగుదేశం శాసనసభ్యులు డా.బెందాళం అశోక్ మరియు ఇచ్ఛాపురం జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు నేతృత్వంలో ఇరు పార్టీల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావించారని అలాగే నియోజకవర్గంలో అందరం అన్నదమ్ముల్లా వారి ఆదేశాలు పాటిస్తూ కలిసి పని చేయాలని, జనసేన-టీడీపీ కలయికను జీర్ణించుకోలేక వైసిపి మనలో మనకే గొడవలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో ఉండాలని స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అశోక్ మరియు ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వర్, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్దులు, మండల అధ్యక్షులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.