జగన్ కు పేర్నినాని కాపలా కుక్క.. రాజా రెడ్డి

  • జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన..
  • పేర్నినాని చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, చెప్పుల దండతో సత్కరించిన జనసేన నాయకులు..

తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు వచ్చిన అశేష స్పందనను చూసి తట్టుకోలేక వైసీపీ నేత పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గురువారం తిరుపతి గాంధీ విగ్రహం వద్ద జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, బాబ్జి, కొండ రాజమోహన్, సుమన్ బాబు, మునస్వామి, బలరాం, రాజేష్ ఆచారి, హిమవంత్, మోహన్, రమేష్, కిరణ్, హేమంత్, బాలాజీ, రాజేంద్ర, పురుషోత్తం, ఆదికేశవులు, సుజిత్, షరీఫ్, మహేష్, మణి, విశ్వ, విరమహిళలు లక్ష్మి, చందన, దుర్గ మరియు జన సైనికులతో కలిసి వారు మాట్లాడుతూ ఖబడ్థార్ పేర్ని నాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మంత్రి పదవి పీకేసినా పేర్ని నానికి బుద్ధి రాలేదని, బందరు రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్లే ధైర్యం నానికి ఉందా అని, జగన్ కు పేర్నినాని ఒక కాపలా కుక్క అని, పేర్నినానికి జగన్ వేసిన మార్కులు సున్నా అని, పవన్ పై ఎన్ని విమర్శలు చేసిన సిఎం నీకు మార్కులేయడని, మా నాయకుడి పై అనిచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నాని చిత్రపటానికి చెప్పుల దండ వేసి సత్కరించి వచ్చే ఎన్నికల తరువాత పేర్ని నానికి రాజకీయ సన్యాసం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.