సమస్య పరిష్కరించకపోతే దీక్షకు దిగుతాము: అరికేరి జీవన్ కుమార్

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్లు పట్టణంలో సోఫియా కాలనీ ధర్మవరం గేటు దగ్గర వాటర్ పైప్ లైన్ వర్క్ ని పూర్తి చేయకుండా తీసిన గుంతను పూడ్చకుండా ఉండడం వలన అక్కడ ఉంటున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ కు జనసేన ఆధ్వర్యంలో తెలియచేయగా.. మునిసిపల్ కమిషనర్ వెంటనే వాటర్ పైప్ లైన్ వర్క్ జరుగుతున్న స్థలాన్ని పరిశీలించి ఒక నెలలో పూర్తి చేసే విధంగా చూసుకుంటాను అని మున్సిపల్ కమిషనర్ గారు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం గేటు వద్దనున్న సోఫియా కాలనీలో పైప్ లైన్ కోసం దాదాపు 10 అడుగుల పై గుంతను సుమారు 9 నెలల క్రితం తవ్వారు ఇప్పటి వరకు పని పూర్తి కాలేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆపడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలు తీర్చడంలో లేదు. ఒక నెలలోగ పూర్తి కాకపోతే జనసేన పార్టీ అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందర నిరసన దీక్ష చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ 31వ వార్డ్ అభ్యర్థి తాడిపత్రి విజయ్ కుమార్, తాడిపత్రి మహేష్ కుమార్, గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు జీలన్ భాష, అర్ సీ సురేష్, సోఫియా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.