క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసే విధంగా ప్రణాళిక

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ క్రియాశీల సభ్యత్వంకి సంబంధించి పూర్తి వివరాలు మరియు పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసే విధంగా ప్రణాళిక వివరించడం జరిగింది. అనుకోని సంఘటనలు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ బిల్లు 50 వేల వరకు, దురదృష్టవశాత్తు మరణించిన ఎడల 5 లక్షలు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, మండల అధ్యక్షులు మొహిద్దిన్, ఆంజనేయులు, ఈరన్న, కృష్ణ, రమేష్, రాజు, వంశీ, జాకీర్, జనసేన వీర మహిళా షేక్ తార, ఎర్రి స్వామి, రామలింగ, శ్రీనివాసులు, నరసింహ, వెంకటేష్, మహేష్, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.