నిరసన చేయనున్న జనసేన నేతల అక్రమ అరెస్ట్

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాలు మేరకు ఒంగోలులో హెచ్.సి.ఎం కాలేజీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చి కాండిల్స్ తో నిరసన తెలియజేయడానికి వెళ్తున్న 13 మంది జనసేన పార్టీ వీర మహిళలను అరెస్ట్ చేసి ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది, అనంతరం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల, దండే అనిల్, ఆర్ కె నాయుడు ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఉష ఆకుపాటి, ఉష,మరియు వీర మహిళలు నాగేంద్రం, సుబ్బులు, రమ్య, శిరీష, పావని, అమృత, దివ్య, స్రవంతి,25వ డివిజన్ అధ్యక్షులు పోకల నరేంద్ర, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.