వర్కర్స్ యూనియన్ అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం: ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు మంగళవారం ది మార్కాపురం ఎనామిల్ స్లేట్ ఆపరేటర్స్ మరియు వర్కర్స్ యూనియన్ యొక్క అత్యవసర సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బుధవారం నుంచి జరగబోయే సమ్మె గురించి కార్యవర్గ సభ్యులు వర్కర్స్ విన్నపాలను యూనియన్ అధ్యక్షులు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కు తెలియజేశారు. దీనిలో భాగంగా ఇమ్మడి కాశీనాధ్ యూనియన్ లోని 12 మంది సభ్యులతో కూడిన ఏరియా కమిటీలు నిర్ణయించారు.