Ibrahimpatnam: జోరు వానలో ప్రచార హోరు 8వ వార్డు అభ్యర్థిని శ్రీమతి బొలియాశెట్టి విజయదుర్గ

ఇబ్రహీంపట్నం, విజయవాడ కొండపల్లి పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్రీమతి బొలియాశెట్టి విజయదుర్గ వార్డు సమగ్రాభివృద్ధికి పోరాడే జనసేన పార్టీని గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపిన్చాలని కోరారు. ఆమె మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా మేమున్నాము అంటూ అండగా నిలబడటమే కాకుండా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న తనని ఆశీర్వదిస్తే మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న పార్టీ అభ్యర్థులను గెలిపించి కౌన్సిల్ కు పంపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పని చేసే జనసేన పార్టీ అభ్యర్ధులకే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ ప్రచారంలో అభ్యర్థిని భర్త, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియాశెట్టి శ్రీకాంత్, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.