ఇమ్మడి కాశీనాధ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బచ్చలకూర పాడు జనసైనికులు

మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ను వారి స్వగృహంలో కొనకనమిట్ల మండలం, బచ్చలకూర పాడు గ్రామ జనసైనికులు మర్యాదపూర్వకంగా కలిసి మే 31వ తేదీన యడవల్లి వారి గృహప్రవేశానికి మరియు జూన్ 1 తేదీన అనగా గురువారం రోజు యడవల్లి వారి షాదీ ముబారక్ కి రావాలి అని ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆకుముల్ల గాలయ్య, యడవల్లి రసూల్ భాయ్ మరియు కొనకనమిట్ల మండలం జనసేన పార్టీ నాయకులు తోట శ్రీనివాస్ పాల్గొనడం జరిగినది.