కానాల బాలనాగమ్మకు నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం శ్రీనివాస థియేటర్ వద్ద స్వర్గస్థులైన కానాల బాలనాగమ్మ భౌతిక దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, ఇ.పిచ్చయ్య, ఫణి, దురుబేసుల శ్రీను, వెంకటేశ్వర్లు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.