ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడిగా మాదాసు నరసింహ

ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడిగా చిట్వేల్ గ్రామానికి చెందిన చిరంజీవి అభిమాని, జనసేన నాయకుడు అయినటువంటి మాదాసు నరసిమ్హ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై చెప్పిన అని తూచా తప్పకుండా నిర్వహిస్తున్న మాదాసు నరసింహ ఏకగ్రీవంగా నియమిస్తూ చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడు ఆదేశాల మేరకు కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్ ఎన్నుకున్నారు. మాదాసు నరసింహా మాట్లాడుతూ… మెగా ఫ్యామిలీకి జనసేన పార్టీకి ఎల్లవేళల తోడు ఉంటానని అన్నారు. నన్ను గుర్తించి ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు గౌరవ అధ్యక్షులు మెగాబ్రదర్ నాగబాబు అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడుకి, ఫైర్ బ్రాండ్ తాతంశెట్టి నాగేంద్రకి రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్ కి జిల్లా అధ్యక్షులు పండ్ర రంజిత్ కి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహిస్తూ అభిమాన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని మాదాసు నరసింహ తెలిపారు.