యువత మేలుకో జనసేనానిని సీఎంను చేద్దాం!

  • జనసేన పార్టీ పిలుపు

తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి యువత నడుం బిగించి వారి ఓటును నమోదు చేసుకుని, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి తద్వారా దోపిడి ప్రభుత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలని జనసేన పార్టీ నేతలు, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, మదు బాబు, కొండా రాజమోహన్, రాజేష్ ఆచారి, మునుస్వామి, రమేష్ నాయుడు, హిమవంత్, గుట్టా నాగరాజు తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు మేల్కొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేసి జనం పక్షం ఉండే జనసేన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా సీట్లను గెలిపించి జనసేనాని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.