గురుదత్ ప్రసాద్ అధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, చక్రద్వారాబంధం గ్రామంలో భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలలో జనసేన పార్టీ సీనియర్ లీడర్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం గ్రామపెద్దలు, గ్రామ జనసేన పార్టీ నాయకులు మరియు రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర గారితో కలిసి జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు.