జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

  • కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్లు

హైదరాబాద్, తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రశాశన్ నగర్లో గల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అద్యక్షులు రాధారం రాజలింగం పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనాడు నవాబుల అండదండలతో తెలంగాణ ప్రజలను మరియు మహిళలపై అఘాయిత్యాలు చేసిన రజాకార్ల పై పోరాడి అమరవీరులైన చాకలి ఐలమ్మ, దొడ్ల కొమరయ్య మరియు ఇతరపోరాట వీరులను స్మరించుకుంటూ వారికి జోహార్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఓట్లకై హడావుడి చేయడం బాధాకర విషయమని ఇకనైనా అధికారికంగా ప్రకటించి రాబోయే రోజుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా చేయాలని అన్నారు. అదేవిధంగా జనసైనికులు ప్రతి డివిజన్లో మరియు ప్రతి గ్రామములో ఘనంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా జనసెనపార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అద్యక్షులు రాధారం రాజలింగం, తెలంగాణా జనసేన పార్టీ విద్యార్ధి విభాగ అద్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ మండలి దయాకర్ కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ లు కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, నాగరాజు, జనసేన వీరమహిళలు మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసైనికులు పాల్గొన్నారు.