జనసేన ఆధ్వర్యంలో పాలకొల్లులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పాలకొల్లు నియోజకవర్గం: భారతదేశ 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాలకొల్లు పట్టణ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షుడు శిడగం సురేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర ఉదయ శ్రీనివాస్, బన్నీ వాస్ హాజరయ్యారు. ముందుగా గాంధీ బొమ్మల సెంటర్ నందు జాతీయ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రామారావు పేట, వీవర్స్ కాలనీ, మావుళ్లమ్మ పేట, దేశాలమ్మ గుడిసెంటరు, బంగారు వారి చెరువు గట్టు, సుబ్బారాయుడు గుడిసెంటరు, మారుతి థియేటర్ సెంటర్ నందు జాతీయ జెండా ఆవిష్కరణ మరియు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గవర ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాసు)మాట్లాడుతూ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారత దేశంలో అందరికీ సమన్యాయం ఉండాలని, సామాజిక న్యాయం జరగాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ఆయన ఆశయాలకు ప్రజలు జనసైనికులు కార్యకర్తలు అందరూ తోడ్పాటునందించి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోనం వెంకట నరసయ్య, అల్లు రాధాకృష్ణ, సిద్దిరెడ్డి అప్పారావు, తులా రామలింగేశ్వరారావు, సాధనాల దుర్గ బాబు, కొమ్ముల దినేష్, తులా సురేష్, పువ్వల వెంకటేష్, విన్నకోట గోపి, బొద్దాని శిరీష్, అలుగు సత్తిబాబు, సలాది సౌబిత్, తఒగెల్ల సత్తిపండు, ఆచంట రామకృష్ణ, బిట్టా లక్ష్మీనారాయణ, పినిశెట్టి శ్రీనివాస్, యాళ్ళ రవీంద్రనాయుడు, ప్రసాద్, పెంటపాటి విజయ్, ఉదయ్, మండెల రజని అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.