విజయనగరం జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయనగరం నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక పాల్ నగర్ దగ్గరున్న జనసేన పార్టీ విజయనగరం కేంద్ర కార్యాలయం నందు మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా శ్రీమతి పాలవలస యశస్వి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి వేడుకగా జరుపుకున్నారు. అనంతరం శ్రీమతి యశస్వి గౌరవ ఇండియన్ ఆర్మీలో విశిష్ట సేవలందించిన జవాన్లకు గౌరవ సత్కార సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.