అనుశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • కూటమి గెలుపు కోసం పనిచేయాలని అనుశ్రీ పిలుపు

రాజమహేంద్రవరం, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో గురువారం ఉదయం ఆ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ రాజమండ్రి నగర ఇంచార్జ్ అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచేందుకు ఆయన వ్యూహాలకు తగ్గట్టుగా అందరం కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను బలపరచి వారి గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన పార్టీ అధినేతకు ఈ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో బలమైన మద్దతు అవసరమని అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలనన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జరుగుతున్న వేడుకలను పార్టీ శ్రేణులు వీక్షించేందుకు స్థానిక సితార హోటల్ నందు లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు నగర జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.