గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో బొబ్బిలి జనసేన పార్టీ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వీర మహిళలకు సన్మానించి బహుమతులు ఇవ్వడం జరిగింది. గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ జనసేన-టిడిపిఉమ్మడి అభ్యర్థిని అత్యధికంగా గెలిపించాలని కోరుకున్నారు. బంటుపల్లి దివ్య మాట్లాడుతూ మహిళలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లంక రమేష్, అడబాల నాగు గారువీర మహిళలు బంటు పల్లి దివ్య, లక్ష్మి, వరలక్ష్మీ, రామలక్ష్మి, సునీత, రమ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.