ఇంటింటా జనసేన క్రియాశీలక సభ్యత్వ అవగాహన కార్యక్రమం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండ మిట్ట కాలనీలో ఇంటింటికీ పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగాగ్రామంలోని ప్రతి గడపకు వెళ్ళి జనసేన పార్టీ గురించి వివరిస్తూ పార్టీకి అండగా నిలబడిన వాళ్ళ కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏవిధంగా అండగా నిలబడుతున్నారో వివరిస్తూ, సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అందిస్తూ సేవలను వివరించారు. దానికి సంబంధించిన ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికి పంచిపెట్టారు.  ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు గోపి, జిల్లా కార్యదర్శి పద్మజ, ఐటీ కోఆర్డినేటర్ శివ కుమార్, వీర మహిళలు పుష్ప, జ్ఞాన ప్రసూనాంభ, నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, గిరీష్ జనసైనికులు బాలు, హేమంత్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.