లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం

అనంతపురం జిల్లా, అనంతపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు రోడ్డు, అరవింద నగర్, అశోక్ నగర్, హరిహర నగర్, సాయి నగర్, కమలానగర్ కాలనీలో, క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ కాలనీవాసులతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు లాయర్ మురళీకృష్ణ, పాలగిరి చరణ్ తేజ్, సాయి నగర్ రామకృష్ణ, వీరమహిళలు శాంతి, వరలక్ష్మి, భవాని నగర్ మంజునాథ్, మధుసూదన్, హరీష్ నాయక్, ప్రవీణ్ కుమార్, వెంకటాద్రి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.