ఎన్.హెచ్.ఆర్.సి.నియోజకవర్గాల కమిటీలకు ఆహ్వానం.. వంగల దాలినాయుడు

పార్వతీపురం: జాతీయ మానవ హక్కుల కమిటీ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ -ఎన్.హెచ్.ఆర్.సి) నియోజకవర్గాల కమిటీల నియామకానికి ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు తెలిపారు. పార్వతీపురం పట్టణంలో శనివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొర్లి వెంకటరమణారావు, జిల్లా కార్యదర్శి బోనెల పరుశురామ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కదిరి రాము ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కమిటీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. సామాజిక సేవ చేసే తత్వం, ప్రజా సమస్యల పట్ల పోరాడే గుణం, సామాన్యుల హక్కుల రక్షణ కోసం, వారి ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేసేవారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యావంతులు, మేధావులు, సంఘ సేవకులు, సామాజిక బాధ్యత కలిగినటువంటి వారిచే కమిటీల నియామకం ఉంటుందన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు శ్రమించే ఆసక్తి ఉన్నవారు 9494012244 కు సంప్రదించాలన్నారు.