జనసేన ప్రజా చైతన్య యాత్ర 22వ రోజు

బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర ఐ.టీ వింగ్ సభ్యులు గేదుల సతీష్ జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం” 22వ రోజు కార్యక్రమాన్ని బొబ్బిలి మండలం ఎం. బుర్జివలస, గొర్లె సీతారామపురం గ్రామాల్లో, ఇంటింటా ప్రచారం, మరియు ఉపాధి హామీ పథకం పనులును పరిశీలించడం జరిగింది. బొబ్బిలి జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ డా. గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర ఐ.టీ వింగ్ సభ్యులు గేదుల సతీష్ సమక్షంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ.. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.