కేతంరెడ్డి నీకిది తగునా?

  • వింజమూరు మండల జనసేన ఉపాధ్యక్షులు షేక్ సుభాని

ఉదయగిరి: జనసేన పార్టీ నీకు తగిన గౌరవం కల్పించి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించినప్పటికి, మూడు రోజులకు ముందు పార్టీ మారి అప్పుడే జనసేనను, జనసేన అధినేతలను విమర్శించడం నీకు తగునా అని వింజమూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సుభాని గురువారం కేతంరెడ్డి వినోద్ రెడ్డిని కోరారు. సుభాని విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అంతర్గత విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శించడం నీకు తగదని కేతంరెడ్డి కి హితవు పలికారు. ప్రస్తుతం నువ్వు చేరిన పార్టీ విధివిధానాలు, అభివృద్ధి నువ్వు చెప్పుకుంటే బాగుంటుంది కానీ, పార్టీ వీడి ఆ పార్టీ ని విమర్శించడం సహేతూకం కాదని షేక్ సుభాని విమర్శించారు. పార్టీ ని వీడగానే తప్పోప్పులు ఎంచుతూ, మీడియా కు ఎక్కడం సరి కాదని ఇలాంటి చౌకబరు రాజకీయాలు చేయడం తగదని, ఇలాంటి విషయాలను పునరాలోచించుకోవాలని అందుకు సంబందించి నీ విజ్ఞత కే వదిలేస్తున్నామని సుభాని తెలిపారు.