తెలంగాణలో ఐసెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థి లోకేశ్ కు మొదటి ర్యాంకు

తెలంగాణలో ఎంబీ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కు సంబంధించి ఫలితాలను నేడు విడుదల చేశారు. హైదరాబాద్ కు చెందిన లోకేశ్ కు మొదటి ర్యాంకు లభించింది. రెండో ర్యాంకును పమిడి సాయితనూజ (హైదరాబాద్) సాధించగా, నవీన్ కృష్ణన్ (మల్కాజిగిరి) మూడో ర్యాంకు పొందాడు. ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర్ సంయుక్తంగా 4వ ర్యాంకు దక్కించుకున్నారు.

ఐసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈసారి ఐసెట్ కు 56,962 మంది హాజరు కాగా, 51,316 మంది అర్హత సాధించారు.