‘అర్జున’ అవార్డుకు ఎంపిక కావడంతో ఇషాంత్ శర్మ సంతోషం

ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలంగా లంబూ అభివర్ణించాడు. అయితే.. అర్జున అవార్డులు ప్రకటించిన తరువాత సోమవారం ఇషాంత్‌ శర్మ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది. అర్జున అవార్డు తనను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉందని.. తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలమని పేర్కొన్నాడు. అవార్డు దక్కడం పట్ల తనతోపాటు.. తన కుటుంబం గర్విస్తోందని ఇషాంత్ పేర్కొన్నాడు. భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టులో ఉన్న తన భార్య ప్రతిమ తనకంటే ఎక్కువగా సంతోషపడిందని ఆనందం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ఇషాంత్ శర్మ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్నాడు.