Simhachalam Templeకు అంతర్జాతీయ గుర్తింపు

విశాఖ జిల్లాలో కొలువుదీరిన సింహాచలం పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం తదితర అంశాలపై ఈ విశిష్ట గుర్తింపును కల్పించారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఐఎస్‌ఒ ధ్రువపత్రాన్ని సింహాచల ఆలయ ఇఒ సూర్యకళకు అందించారు. కాగా, కేంద్ర ప్రసాదం కింద సింహాచల క్షేత్రానికి రూ.53 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఇఒ సూర్యకళ వెల్లడించారు.