సాటి మనిషికి సాయం చేసే గుణం మనిషికి దేవుడిచ్చిన వరం జనసేనతో అది మరింత సాధ్యం

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో రాళ్ళచేరువుపల్లే నందు జీవన జ్యోతి ఆనందనిలయ అనాథ వృద్ద ఆశ్రమం నందు జనసేన దళిత నాయకులు నగిరిపాటి మహేష్ వృద్దులకి ఉచిత వైద్యశిబిరంను ఏర్పాటు చేసి స్వయాన వారికి ప్రాధమిక వైద్య సహాయంను అందించడం జరిగినది. వారు మా పట్ల చూపిన అభిమానం, వారికళ్ళల్లో ఆనందం చాలా భావోద్వేగానికి గురిచేసిందనీ… ఈ ఆశ్రమాన్ని స్థాపించడానికి అంగవైకల్యం అనేది పాణ్యం సుబ్రమణ్యం వ్యక్తిత్వం ముందు చిన్నబోయి, విధిని సైతం లెక్కచేయకుండా ఆదర్శవంతంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ వృద్దులు వారి మనవళ్ళు మనవరాళ్లను ఎత్తుకొని ఆడించుకొనే వయసులో అనాధ జీవిగా జీవచ్చ్వంగా కన్న పేగుకి దూరంగా జీవిస్తున్నారు. ఇలాంటి వారిని తమ సొంత తల్లిదండ్రులుగా ఆశ్రయం కల్పించి అండగా ఉన్న పాణ్యం సుబ్రమణ్యంకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత సోదరులు సహాయంగా నిలిచారు. ఈ వృద్ధాశ్రమంను వెలుగులోకి తెచ్చిన మీడియమిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు.