మానవత్వం చాటుకున్న రాజోలు జనసైనికులు

కోనసీమ జిల్లా, రాజోలు, మానవత్వం చాటుకున్న రాజోలు నియోజకవర్గ జనసైనికులు, నియోజకవర్గంలోని పలువురికి 66,000 ఆర్ధిక సహాయాన్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేతులు మీదుగా అందచేశారు. మలికిపురం మండలం లక్కవరంలో అగ్ని ప్రమాదంలో ఇంటిని కోల్పోయిన నల్లి ఆనంద్ కుమార్ కుటుంబానికి 20,000 రూపాయలు నగదును నిత్యవసర సరుకులను అందజేశారు అలాగే, అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు 11వేల రూపాయలు నగదును, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టేకు ప్రసాదు అనే వ్యక్తికి 10,000 రూపాయలు నగదును బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న టేకు జాను అనే వ్యక్తికి 25 వేల రూపాయలను అందజేశారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ… కష్టం ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు, ఎన్నుకున్న ఎమ్మెల్యే లేకపోయినా కష్టాల్లో ఉన్నవారికి జనసైనికులు అండగా నిలుస్తున్నారని, పార్టీ మూల సిద్ధాంతాలు ఆచరిస్తూ, ఒక్కరికి కష్టం వస్తే 100 మంది జనసైనికులు అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.