త్రిమూర్తులు కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన ప్రత్తిపాడు జనసేన

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం, “సిరిపురం” గ్రామానికి చెందిన వజ్రంగి త్రిమూర్తులు అనారోగ్యంతో మరణించడం జరిగిందని విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు, మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) జనసేన తరపున ఆ కుటుంబానికి 5000 రూపాయలు సిరిపురం గ్రామ జనసేన నాయకులు, వజ్రంగి శ్రీనుబాబు మరియు జనసేన నాయకుల చేతుల మీదగా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.