పార్వతీపురం పట్టణంలో భగత్ సింగ్ కు ఘన నివాళులు

పార్వతీపురం పట్టణంలో జనసేన, తెలుగుదేశం నాయకులు స్థాపించిన స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు భగత్ సింగ్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా, జనసేన భగత్ సింగ్ యువజన సేవా సంఘం అధ్యక్షులు చిట్లు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి, బాబు పాలూరు, టిడిపి మాజీ ఎమ్మెల్యే చిరంజీవి మాస్టర్, టీడీపీ సీనియర్ నాయకులు మజ్జి క్రిష్ణ మోహన్, టిడిపి మాజీ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కోల బాబు, జనసేన పార్టీ పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మణి, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు, పార్వతిపురం జిల్లా నాయకులు, గుంట్రేడ్డి గౌరీ శంకర్, బోనెల ఇందు, గంటేడ స్వామి నాయుడు, నారాయణపురం ఆదినారాయణ, తేజ, జానీ మాస్టర్, అనంత్, సిగడం భాషా, మొదలగు నాయకులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఇంక్విలాల్ జిందాబాద్ అని నినదిస్తూ శ్రీ భగత్ సింగ్ గారి ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని ప్రమాణం చేయడం జరిగింది.