నిర్మాణ దశలోనే కూలిపోతున్న జగనన్నగృహాలు

గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి కి “జగనన్న ఇల్లు” ముచ్చర్ల గ్రామం నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా గృహాలు నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయి, నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు, లబ్ధిదారులు అధికార పార్టీ నాయకులకు భయపడి ముందుకు రావడం లేదు, ఈ విషయంపై సోమవారం కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ విషయంపై జనసేన పార్టీ తగు న్యాయం చేయాలని లబ్ధిదారులకు కట్టిన ఇల్లు కూలగొట్టి నాణ్యమైన ఇల్లుని పునర్నిర్మించాలని కోరడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన్ రావు, టి. రామకృష్ణ ( బాలు) మిడతాన రవికుమార్, మురళి మోహన్, సాయి, రాజు, సురేష్ పాల్గొన్నారు.