నిజమైన ప్యాకెజీ స్టార్ జగన్మోహన్ రెడ్డి!!

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరీ

మదనపల్లి నియోజకవర్గం: కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. చిత్తూరులో డైరీ ప్రారంభోత్సవంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరీ ఖండించారు. పవన్ కళ్యాణ్ ని ప్యాకేజి స్టార్ దత్త పుత్రుడు అంటారు కానీ నిజమైన ప్యాకెజీ స్టార్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. మాటి మాటికీ ఢిల్లీ వెళ్లి అక్కడ ఏమి ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చి మాట్లాడుతున్నావో బహిరంగం చర్చకు మన జిల్లా వాళ్ళు అయినా స్థానిక ఎమ్మెల్యే అయినా చర్చకు జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి అరాచకాలు పెరిగిపోయి ఈ సారి ప్రజలు మీకు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ నాయకులు ఇన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తి గతంగా విమర్శించిన ఆయన మీ అందరిని ఏ నాడు కూడా వ్యక్తి గతంగా విమర్శించలేదు. ఇది ఆయనకు ఉన్న సంస్కారానికి నిదర్శనం అని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా చూస్తామని మదనపల్లి లో కూడా వైసీపీ విముక్త మదనపల్లె ద్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, అంజలి, జనార్దన్, లవన్న, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.