చంద్రబాబు పర్యటనలో పలువురు మృతి వెనుక జగన్ హస్తం: పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, జిఓ నెంబర్ 1 పై స్పంచించిన ముమ్మిడివరం నియోజకవర్గం జనసేనపార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ. వైసిపి ప్రభుత్వం తాలిబన్ల పాలనను తలపిస్తోంది. పవన్ పర్యటకు భయపడే లేనిపోని జీవోలను తెచ్చి అడ్డుకోవాలని చూస్తుంది. అప్రజాస్వామక జిఓలను తెచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేస్తన్న జగన్ ప్రభుత్వం. చంద్రబాబు పర్యటనలో పలువురు మృతి వెనుక జగన్ హస్తం ఉందని పితాని అన్నారు. జిఓ నెంబర్ 1 ఏవిధంగా తెచ్చారో చెప్పాలి, అధికారం పోతుందని తేలిపోయింది. దీనితో ప్రతిపక్ష పార్టీలను అడ్డుకునే కుయుక్తులుతోనే తప్పుడు జీవోలు తీసుకువచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని పితాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, జక్కంశెట్టి బాలకృష్ణ, గొల్లకోటి వెంకన్నబాబు, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాలప్రసాద్, అత్తిలి బాబురావు, ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, నూకల దుర్గబాబు, పిల్లి గోపి, పెన్నాడ శివ, పితాని శివ, ఎంపీటీసీ జమి, బీమాల సూర్యనాయుడు, గేదెల స్వరూప్, దూడల స్వామి, కడలి కొండ, వంగ విజయ్తో సీతారాం, లేటి గోపీ మొదలగు వారు హాజరయ్యారు.