రామాలయం నిర్మాణం కొరకు రాయపురెడ్డి రూపాయలు 20,116/- విరాళం

మాడుగుల, ఎల్.పొన్నవోలు పంచాయతీలో నరసయ్య గ్రామంలో రామాలయం నిర్మాణం కొరకు స్థానిక జనసైనికులు ఆహ్వానం మేరకు మాడుగుల జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు రాయపురెడ్డి కృష్ణ విచ్చేసి రామాలయం నిర్మాణం కొరకు తమ వంతు ఆర్థిక సాయం 20,116/- రూపాయలు స్థానిక జనసైనికులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సమక్షంలో చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. తదనంతరం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు జనసైనికులు కృష్ణని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు జనసైనికులు అందరూ పాల్గొని కృష్ణకి సంతోషంతో శుభాకాంక్షలు తెలియజేశారు.