ప్రతి ఇంటా జనసేన జెండా ఎగరాలి: శివదత్ బోడపాటి

పాయకరావుపేట నియోజకవర్గం: పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ఆద్వర్యంలో గ్రామ స్థాయి కార్యవర్గ సభ్యుల సమావేశం ఎర్పాటు చేయడం జరిగింది. 25 మంది కార్యవర్గ సభ్యులతో సుమారు రాత్రి 10 గంటల వరకు జరిగిన ఈ గ్రామ సమావేశం పార్టీ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. ఈ సందర్బంగా శివదత్ బోడపాటి మాట్లాడుతూ.. ప్రతి ఇంటా జనసేన జెండా ఎగరాలి అని.. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మేముసైతం అంటూ ముందుకు వచ్చిన మాసాహెబ్ పేట గ్రామ జనసైనికులకు హృదయపూర్వక అభనందనలు తెలియజేసారు.