సర్వేపల్లిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు గురువారం 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజలకు ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్లకి అండగా నిలబడుతూ అధికార పార్టీ నాయకుల దాస్టికాలను ఎండగట్టుతూ వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలను పాటిస్తూ పార్టీని సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు కూడా బలంగా ప్రజలలోకి తీసుకువెళ్తూ జనసేన పార్టీ ఎంతో బలంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జనసేన వైపు చూస్తుంది రాష్ట్ర రాజకీయాలను జనసేన పార్టీ శాసించే స్థాయికి వచ్చింది అంటే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మార్పు కోసం వచ్చిందే జనసేన ఈరోజు రాష్ట్రం కోసం యువత కోసం ఆయన స్వలాభాన్ని కూడా చూసుకోకుండా పొత్తులో భాగంగా జనసేన బిజెపి తెలుగుదేశం మూడు కూడా ఒకే తాటిపైకి వచ్చి ప్రజా ప్రభుత్వ స్థాపనలో భాగంగా ముఖ్య పాత్ర పోషించినది జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఆయన నిర్ణయాన్ని శిరసావహిస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మేము ఆయన వెంటే అడుగులొ అడుగు వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి నడుస్తున్నాం రేపు ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జనసేన పార్టీ సత్తాని చూపిస్తాం. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని పినిశెట్టి, మల్లికార్జున్ శ్రీహరి, డిక్కీ దయాకర్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం అక్బర్ అశోక్ మస్తాన్ మురళి మండల నాయకులు సుధాకర్ తోటపల్లి, గూడూరు మండల ఉపాధ్యక్షుడు కల్తిరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.