యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించిన మేకా ఈశ్వరయ్య

జనసేన మండల కమిటీ సమావేశం

చింతలపూడి: జనసేన పార్టీ లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు ఆధ్వర్యంలో తువ్వచిలక రాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ మండల కమిటీ సమావేశంలో చింతలపూడి జనసేన పార్టీ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో యువశక్తి పోస్టర్ ను ఈశ్వరయ్య ఆవిష్కరించి జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే యువశక్తి కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు, అధిక సంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. రాబోయే ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, చింతలపూడి నియోజకవర్గంలో జనసేన విజయం తధ్యం అని అందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.‌ ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల గౌరవ అధ్యక్షుడు మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు పఠాన్ వలీ, తాళం మల్లేశ్వరరావు, చల్లా నాగబాబు, నిమ్మగడ్డ రామ్ కుమార్. ప్రధాన కార్యదర్శులు ముణికొండ వంశీ గోపి, బంటు సామ్యూల్ రాజు, మోదుగు అంజి బాబు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, పఠాన్ సుభాని, సంయుక్త కార్యదర్శులు కలవకొల్లు నాగరాజు, ముత్యాల నాగేంద్ర, వీర మహిళ బంటు సంధ్యారాణి మరియు లింగపాలెం మండల జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.