పాత్రికేయుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా జనసేన

కదిరి నియోజకవర్గం: ఓ.డి.చెరువు నందు పాత్రికేయులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా ( సోమవారం నుండి) స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా పాత్రికేయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం పాత్రికేయుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా శ్రీ సత్య సాయి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, మండల కార్యదర్శి మేకల ఈశ్వర్ తదితరులు మద్దతు పలికారు.