కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ జనసేన

  • భూక్యా సతీష్ నాయక్ బీమా చెక్కు అందజేత

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు భూక్యా సతీష్ నాయక్ ప్రమాదంలో గాయపడగా ఆయన కుటుంబానికి రూ. 45190 రూపాయల బీమా చెక్కును జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదల నాగేంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు బైరి వంశీ కృష్ణ, సనత్ నగర్ కోర్డినేటర్ మండపాక కావ్య, సురేష్ రెడ్డి, లకావత్ నరేష్ నాయక్ పాల్గొన్నారు..