చంద్రబాబుతో సమావేశానికి బయలుదేరిన జనసేన నాయకులు

మదనపల్లి: జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మరియు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుప్పంలో ఎన్ ఎం కళ్యాణ మండపంలో సమావేశానికి జనసైనికులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డెమ్మ, గిరి, రూరల్ ఉపాఅధ్యక్షులు చంద్రశేఖర, రూరల్ జనరల్ సెక్రటరీ జంగాల గౌతమ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నవాజ్ తదితరులు పాల్గొన్నారు.